వరంగల్: సద్దుల బతుకమ్మ వేడుకల విషయంలో గందరగోళం నెలకొంది. కొందరు పండితులు సోషల్ మీడియాలో బతుకమ్మ పండుగపై వివాదం సృష్టిస్తున్నారు. పండితుల భిన్న ప్రకటనలతో మహిళలు అయోమయంలో పడేస్తున్నారు. ఈ నెల 30న అష్టమిరోజు శాస్త్ర ప్రకారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ నెల 29న వేడుకలు జరపాలంటున్న మరికొందరు పండితులు చెబుతున్నారు. 9రోజులే ప్రామాణికం కావడంతో శాస్త్రం వర్తించదని వాదనలు వస్తున్నాయి. 30న సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.