హైదరాబాద్: మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజిబిఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసిందని టిఎస్ ఆర్ టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఈరోజు ప్రయాణికులు ఎంజిబిఎస్ కు రావొద్దు అని సూచించారు. ఎంజిబిఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని తెలియజేశారు. అదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జెబిఎస్ నుంచి నడుస్తున్నాయని, వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి నడుస్తున్నాయని, సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి. పొరపాటున ఎమ్ జి బిఎస్ కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించేందుకు అవసరమైనన్ని లోకల్ బస్సులు అందుబాటులో ఉంచామని సజ్జనార్ వివరించారు. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రయాణికులు వర్షాలు, వరద తగ్గుముఖం పట్టేవరకు ఎంజిబిఎస్ కు రావొద్దని విజ్ఞప్తి చేశారు.