రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు. కొత్త సంవ త్సరంలో ప్రతి ఒక్కరు తాము ఆశించిన ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రజలంతా ఆనందంతో, ఆరోగ్యంగా ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి ఆకాం క్షించారు.