మన తెలంగాణ/మహబూబాబాద్/తల్లాడ: అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో జరిగిన రో డ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా, గార్లకు చెందిన కడియాల భావన, పులఖండం మేఘన అ నే ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. వారిద్దరూ మూడేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అ మెరికా వెళ్లారు. ఈ మధ్యనే ఎంఎస్ విద్యను పూర్తిచేసుకున్న వారిద్దరూ ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. కొంతమంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా విహారయాత్రకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు లోయలో పడడడంతో మరణించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ ఇ ద్దరు పిల్లలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, యువతుల కుటుంబాలను, వారి తల్లిదండ్రులతో తిరుపతిలో ఉన్న మహబూబాబా ద్ ఎంపి బలరాం నాయక్ ఫోన్ ద్వారా ఘటన పూర్వాపరాలు తెలుసుకొన్నారు. విదేశాంగ శాఖ మంత్రి, విదేశాంగ కార్యాలయాలకు ఫోన్ చేసి వీ లున్నంత వరకు న్యాయం చేకూర్చేందుకు సహా య సహకారాలు అందిస్తానని తెలిపారు. బిడ్డలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. త్వరలో గార్లకు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు ద్వారా తెలిపారు.
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
ఖమ్మం జిల్లా, తల్లాడ మండలంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. విహారయాత్రకు వెళ్లొస్తూ ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈ నెల 26వ తేదీన రెండు కార్లలో 10 మంది జనగామ జిల్లా నుంచి ఒడిశాలోని పూరి జగన్నాథ్స్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం ముగించుకొని తిరిగి విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలో విహారయాత్ర చేసి తిరిగి ప్రయాణం అయ్యారు. వీరిలో అజయ్, కొల్లిపాక క్రాంతి, గట్టు రాకేష్, చిల్లర బాలకృష్ణ, రొయ్యల అనిల్ ఐదుగురు కారులో సత్తుపల్లి మీదుగా ముందు వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు తల్లాడ మండలం, అంజనాపురం గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టడంతో చిల్లర బాలకృష్ణ (30) (కారు డ్రైవర్), రొయ్యల అనిల్ (31) గట్టు రాకేష్ (30) మృతి చెందారు.
కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు కావడంతో ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు ఇరుక్కుపోయారు. జెసిబి సహాయంతో పోలీసులు అతి కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు జనగామ జిల్లా, స్టేషన్ఘన్పూర్ మండలం, జఫర్ఘడ్కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రెండవ ఎస్ఐ వెంకటేష్ దర్యాప్తు చేపట్టారు. దట్టమైన పొగ మంచు, కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రెండు కార్లలో ప్రయాణిస్తున్న యువకులు చిన్నతనం నుంచి 10వ తరగతి వరకు ఒకటే స్కూల్లో చదివినవారు. మృతుల్లో ఒకరు ల్యాబ్ డయాగ్నిస్ట్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మరొకరు మెడికల్ రిప్రజెంటే టివ్గా పనిచేస్తున్నాడు. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.