నల్గొండ: మిర్యాలగూడలోకి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి నీరు అనుకొని లాబోరేటరీ కెమికల్ తాగడంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే గణేష్ అనే 19 ఏళ్ల యువకుడికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో పట్టణంలో గల కృష్ణసాయి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. అయితే ఆ సమయంలో గణేశ్కు దాహం వేయడంతో నీరు అనుకొని అక్కడే ఉన్నా లాబోరేటరీ కెమికల్ను తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.