హైదరాబాద్: శంషాబాద్లోని కవేలిగూడ వద్ద దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిపై కత్తితో దాడి చేసి.. దారుణంగా హత్య చేశారు. శంషాబాద్లోని కవేలిగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు వెంకటాపురానికి చెందిన మహేశ్గా గుర్తించగా.. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలిలో క్లూస్ టీమ్తో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.