రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల లోపు బహిర్గతం చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమద్యం ఎక్స్వేదికగా స్పందించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్ రెడ్డి, చీకటి జీఓల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యాలన్నారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జీఓలు దాచుతూ చేస్తున్న డ్రామా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో బట్టబయలు కాబోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల్లో 19,064 జీఓలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీఓలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో 15,774 జీఓలు అంటే 82 శాతం జీఓలను దాచి పెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని, ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వం? అంటూ సిఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.