బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ‘ధురంధర్’ విజయంతో గ్రాండ్ గా 2025ని ముగిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రణవీర్ సింగ్ కెరీర్ లో తొలి 500 కోట్ల క్లబ్ చిత్రం ఇదే కావడం విశేషం. ఇంత వరకూ ఈ స్టార్ హీరో 500 కోట్ల క్లబ్ లో చేరలేదు. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ చిత్రం 350 కోట్ల వసూళ్లను సాధించింది. అదే అతడి టాప్ గ్రాసర్.