హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికలలోనూ అధికార కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్ననికి పోలింగ్ పూర్తి కాగా.. కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 374 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో బిఆర్ఎస్ 43, బిజెపికి 18, ఇతరులకు 98 స్థానాలు దక్కాయి. కాగా, ఈ విడతలో 193 మండలాలలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడ్డారు.