కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 46.39 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చొప్పదండి(53.98), గంగధారా(45.16), కరీంనగర్ రూరల్(49.64), కొత్తపల్లి(46.19), రామడుగు(40.83) శాతం పోలింగ్ నమోదైంది. 91 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది.