జిఎంఆర్ స్పోర్ట్, ప్రభుత్వం మధ్య చారిత్రాత్మక ఒప్పందం
మన తెలంగాణ/హైదరాబాద్ : జిఎంఆర్ స్పోర్ట్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవొయు) పై సంతకం చేసింది. ఈ ఒప్పందం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగింది. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ రైజింగ్ అజెండా కింద రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులు, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్తు దృక్పథానికి జిఎంఆర్ తమ అంకిత భావాన్ని పునరుద్ఘాటించింది. దుబాయ్ స్పోర్ట్ సిటిని జ్ఞాన భాగస్వామ్య సంస్థగా చేసుకొని, జిఎంఆర్ స్పోర్ట్ భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్ సిటీని అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్లో ఆధునిక శిక్షణా కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల స్టేడియాలు, హై-పర్ఫార్మెన్స్ రిహాబి లిటేషన్ సెంటర్లు, స్పోర్ట్ సైన్స్ సదుపాయాలు వంటి అంతర్జాతీయ ప్రమాణాల వసతులు ఏర్పాటు చేయబడతాయి.
ఈ ప్రణాళిక తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్ ఎక్సలెన్స్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యం. ఒప్పందం సందర్భంగా జిఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్, జిఎంఆర్ స్పోర్ట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రoధి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి శాటిలైట్ స్పోర్ట్ సిటీని అభివృద్ధి చేయడం ద్వారా క్రీడా రంగంలో కొత్త అవకాశా లను సృష్టిస్తున్నాము. ఈ కార్యక్రమం తెలంగాణను వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ క్రీడా కేంద్రంగా నిలబెడుతుందన్నారు. దుబాయ్ స్పోర్ట్ సిటీ సేల్స్, లీజింగ్, ఇన్వెస్ట్మెంట్ హెడ్ రానియా ఓస్లాటి మాట్లాడుతూ, భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్ సిటి రూప కల్పనలో భాగస్వామ్యం కావడం మా గర్వకారణం.
ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా వసతులను తెలంగాణకు అందించేందుకు సహక రిస్తుందన్నారు. టిజి ఐ పాస్ విధానం కింద తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కు అవసరమైన అనుమతులు, మద్దతు అందించనుంది. భారత్ ఫ్యూచర్ సిటి, భారత్లో తొలి నెట్-జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా రూపుదిద్దుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, లైఫ్ సైన్సె స్, ఎంటర్టైన్మెంట్ రంగాలలో కొత్త పెట్టుబడులు, అవకాశాలను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటి, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తోంది.