యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సోమవారం ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. ఎన్టీఆర్ ఫిర్యాదులపై సోషల్ మీడియా ఖతాలపై, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు న్యాయస్థానం వాయిదా వేసింది. డిసెంబర్ 22న సవివరమైన ఆదేశాలు ఇస్తామని జస్టిస్ అరోరా వెల్లడించారు. సినీ సెలబ్రిటీలపై కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అభ్యంతరకర పోస్టులను ఎదుర్కొన్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.