హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ చేపట్టిన దీక్ష ఫలించిన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్ దివస్’ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ సంబరాలు చేపట్టాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కెసిఆర్ 2009, నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ దీక్ష ఫలించిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్ దివస్’ పేరుతో పండగలా జరుపుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.