విజనరీ సుభాస్కరన్ నేతృత్వంలోని లైకా ప్రొడక్షన్స్… జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్- అడ్వెంచర్ కామెడీ సిగ్మాను తెరకెక్కిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కేథరీన్ థ్రెసా… సందీప్ కిషన్తో కలిసి డ్యాన్స్ చేయనుంది. తమన్ పవర్ ఫుల్ ట్రాక్ను కంపోజ్ చేశారు, ఇది సినిమాకి ఒక హైలైట్గా ఉంటుందని హామీ ఇస్తుంది. భారీ, కలర్ఫుల్ సెట్లో చిత్రీకరించబడిన ఈ పాటలో సందీప్ కిషన్, కేథరీన్ థ్రెసా హై-ఎనర్జీ తో స్క్రీన్ను ఉర్రూతలూగించనున్నారు. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.