మన తెలంగాణ/హైదరాబాద్: ఆరోగ్య తె లంగాణ లక్షంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం వై ద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు బలోపేతం దిశగా పలు కార్యక్రమాలు చేపట్టారు. వాటి ఫలితాలు నే డు కళ్లకు కనిపిస్తున్నాయి. ప్రసవాలకు ఏజెన్సీ ప్రాంత గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. గర్భిణులకు అందే వైద్యం నుంచి వృద్ధులకు వచ్చే సమస్యల వరకు ప్రతి రుగ్మతకు ప్రభుత్వ ఆ సుపత్రుల్లోనే సేవలు అందాలని ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ని యామకం, ఆసుపత్రుల నిర్మాణం, వైద్య కళాశాల లు, నర్సింగ్ కళాశాల సంఖ్యను పెంచడంతో పాటు సీట్లను పెంచారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రత్యేక శ్రద్ధతో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు మొదలుకుని ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు వై ద్యారోగ్య రంగాన్ని బలోపేతానికి కృషి చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. 1375 వైద్య చికిత్సల ధరలను సుమారు 22 నుంచి 25 శాతం వరకూ పెంచడంతో పాటు కొత్తగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఫలితంగా ఆరోగ్య శ్రీ కింద అందే చికిత్సల సంఖ్య 1835కి పెరగడంతో లక్షలాదిమందికి ప్రయోజనం కలిగింది. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటళ్ల సంఖ్యను క్రమంగా ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. ములుగు, నారాయణపేట వంటి మారుమూల జిల్లాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
మహానగరంంలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు : హైదరాబాద్ మహానగరంంలో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు (టిమ్స్) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఆల్వాల్ టిమ్స్ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ న్యూరో సైన్సెస్గా, సనత్నగర్ టిమ్స్ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ సైన్సెస్గా, కొత్తపేట్ టిమ్స్ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్యాస్ట్రో సైన్సెస్గా సేవలు అందించనున్నాయి. సనత్నగర్ టిమ్స్లో అన్నిరకాల ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ టిమ్స్ నిర్మాణ పనులను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందాలన్న లక్షంగా ప్రజా ప్రభుత్వం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మాసిస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు, వైద్య కళాశాలల్ల్లో ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాన్ని పెద్ద సంఖ్యలో చేపట్టంది. మొత్తంగా రెండేళ్ల కాలంలోనే వైద్యారోగ్యశాఖలో 9 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసింది. మరో ఏడు వేల పై చిలుకు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
వైద్య..నర్సింగ్..పారామెడికల్ కళాశాలలు : రాష్ట్రంలో కొత్తగా 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,690 నుంచి 4,140కి పెరిగింది. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల సౌకర్యార్థం కొత్త హాస్టల్ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి నిర్మాణానికి రూ.204.85 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 15 శాతం పెంచింది. దేశంలోనే అత్యధిక స్టైఫండ్స్ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొలి ఐదు స్థానాల్లో ఉంది. తెలంగాణలో కొత్తగా 16 నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.
జిల్లాల్లోనూ వాస్క్యులర్ సర్జరీలు : మూత్ర పిండాల సమస్యలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతోంది. డయాలసిస్ చేయించుకోవాలంటే వాస్క్యులర్ యాక్సెస్ పాయింట్ తప్పనిసరి. ఈ వాస్క్యులర్ సర్జరీలు చేసే సదుపాయం ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్లో మాత్రమే ఉంది. డయాలసిస్ చేయించుకునే వారు హైదరాబాద్కు రావడం వ్యయప్రయాసలతో కూడినది కావడంతో జిల్లాల్లోనూ వాస్క్యులర్ సర్జరీలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్లోని ఎంజీఎం, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి , మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి , ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో వాస్క్యులర్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇందు కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. డయాలసిస్ చేయించుకునే వారికి మెరుగైన, సత్వర వైద్య సేవలు అందించడానికి కొత్తగా 18 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
డే కేర్ కేన్సర్ సెంటర్లు ఏర్పాటు : తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డే కేర్ కేన్సర్ సెంటర్ల్ను వైద్యారోగ్య శాఖ ప్రారంభించింది. కేన్సర్ చికిత్స కోసం వ్యాధిగ్రస్థులు రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే కీమో థెరపి చికిత్స అందించే ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లను అమృత ఘడియల్లో (గోల్డెన్ హవర్) ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో 2005 సంవత్సరంలోనే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. తరువాత కాలంలో అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేశాయి. పది నిమిషాల్లోనే అంబులెన్స్ను ఘటనా స్థలానికి పంపించి బాధితుల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
జాతీయ రహదారులపై ట్రామా కేర్ సెంటర్లు : రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర స్మయాల్లో బాధితుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు రూ.వెయ్యి కోట్లతో రెండు సంవత్సరాల్లో ట్రామా కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందించింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే పేషెంట్ను ట్రామాకేర్ సెంటర్కు తరలించి చికిత్స అందించేలా ట్రామాకేర్ వ్యవస్థను రూపొందుతోంది.
సంతాన భాగ్యానికి ఐవీఎఫ్ సేవలు : మాతృత్వం ప్రతి వివాహిత కల. అయితే ఇన్ఫర్టిలిటీ సమస్య పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. ఈ నేపధ్యంలో మాతృత్వం కోసం పరితపిస్తున్న దంపతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ.లక్షల ఖరీదైన ఐవీఎఫ్ సేవలను ఉచితంగా అందచేయాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని గాంధీ, పెట్లబుర్జు ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వరంగల్ ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.
రోగులకు అందుబాటులోకి మందులు : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మందులు సులభంగా అందేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రతి జిల్లాలో సెంట్రల్ మెడిసినల్ స్టోర్ (సీఎంఎస్) ఏర్పాటు చేశారు. కొత్తగా 22 జిల్లాల్లో స్టోర్స్ అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్జెండర్లు కూడా మన సమాజంలో భాగమే. వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్లకు, గౌరవప్రదమైన జీవితాన్ని అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములను చేస్తూ, వారికి ఉపాధి కల్పిస్తోంది. ప్రమాదాలతో పాటు ఇతర సమస్యలతో అకాల మరణం పొందిన వారి నుంచి అవయవాలు సేకరించి ఆయా సమస్యలతో సతమతమయ్యే వారికి అమర్చేందుకు ఉద్దేశించిన జీవన్దాన్ వ్యవస్థను ప్రక్షాళన చేసి పారదర్శకంగా తయారు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.
ఉస్మానియా ఆసుపత్రికి కొత్త సొగసులు : వందేళ్లకు పైగా హైదరాబాద్ నగరంలో వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి కొత్త సొగసులు సమకూరనున్నాయి. రూ.2 వేల కోట్ల వ్యయంతో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోషామహల్లో 26 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన ఆసుపత్రి కోసం పోలీస్ శాఖ నుంచి ఆరోగ్యశాఖకు భూబదలాయింపు ప్రక్రియ పూర్తయింది. అత్యాధునిక వసతులు, ఆపరేషన్ థియేటర్లతో పాటు కొత్త ఆసుపత్రిలో 28 వైద్య విభాగాల్లో వైద్య సేవలు అందనున్నాయి. 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.