మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఫా ర్ములా ఈ- కార్ రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం డివోపిటికి లే ఖ రాశారు. డిఓపిటి(కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ) నుంచి అనుమతి రాగానే ఏసిబి అరవింద్ కుమార్ను విచారించి చార్జ్షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచా రం. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ -కార్ రేసు నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల నిధులు విదేశీ
సంస్థకు వి డుదల చేయడంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు అరవింద్ కుమార్ను ఏసిబి విచారించింది. హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన సమయంలో అరవింద్ కుమార్ కెబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, ఎన్నికల కోడ్ అమలుల్లో ఉండగా నిధులను మళ్ళించడంలో కీలక పాత్ర పోషించారని ఏసిబి ఆరోపిస్తోంది. కాగా, ఇదే కేసులో ఏ1గా మాజీ మంత్రి కెటిఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు ఉన్నారు. దేశంలో ఐఏఎస్ అధికారులపై కేసు విచారణ, అభియోగాలు నమోదు చేసేందుకు ముందుగా కేంద్రంలోని డిఓపిటి నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఈ మేరకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.