మాస్ మహారాజా రవితేజ.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో అలరించబోతున్నారు . ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ తర్వాత మేకర్స్ ఇప్పుడు ఫుట్ట్యాపింగ్ ట్రాక్ బెల్లాబెల్లాతో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. మాస్-ను ఆకట్టుకునే చార్ట్బస్టర్లను అందించడంలో పాపులరైన భీమ్స్ సిసిరోలియో, జానపద సంగీతంతో కూడిన ఫుట్ట్యాపింగ్ నంబర్తో ఆకట్టుకున్నారు.‘స్పెయిన్కే అందాలనిట్ట, అద్దిన ఓ పూల బుట్టా… వీధుల్లో పోతుంటే అట్టా వార్తల్లో రాయాలి చిట్టా’ అంటూ సురేష్ గంగుల రాసిన లిరిక్స్లో వైబ్ అదిరిపోయింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కట్టిపడేసింది.
రవితేజ, ఆషికా రంగనాథ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ రిఫ్రెషింగ్, ఎలక్ట్రిక్గా అనిపిస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి 2026 సంక్రాంతికి విడుదల కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ డింపుల్ హయాతి మాట్లాడుతూ “చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు బాలమణి. అందరికీ ఈ పాట నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా అద్భుతమైన పాట లు ఉన్నాయి. మాస్ మహారాజా అంటే ఎనర్జీ. అదే ఎనర్జీ సంక్రాంతితో చూడబోతున్నాం”అని అన్నారు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ “మంచి కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. రవితేజ ఎనర్జీ మ్యాచ్ చేయడం అంత సులభం కాదు. ఆయన అద్భుతమైన డ్యాన్సర్”అని తెలిపారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ “భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి”అని పేర్కొన్నారు.