ఈ నెల 2న చెన్నైలో జరిగే శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. జర్నలిస్ట్ శోమా చౌదరి ఆధ్వర్యంలో ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ‘రిబూటింగ్ ది రిపబ్లిక్’ అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ వేదికపై జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.