హైదరాబాద్: పోలవరం నుంచి గోదావరి జిలాల మళ్లింపునకు ప్రయత్నిస్తున్నామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. జలాల మళ్లింపు యత్నాల దృష్ట్యా రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టామని అన్నారు. బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని చెప్పామని తెలిపారు. ట్రైబ్యునల్ తీర్పులు, చట్టాలు, జలసంఘం మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని కేంద్రానికి లేఖలు రాశామన్నారు.
‘‘రాష్ట్ర చర్యలతో పర్యావరణ శాఖ ఎపి ప్రతిపాదనను వెనక్కి పంపింది. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం అభ్యంతరాలు తెలిపాయి. గోదావరి, కృష్ణా బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరం తెలిపాయి. జులై భేటీలో పోలవరం, బనకచర్ల అజెండాగా చేర్చడాన్ని తిరస్కరించాం. పోలవరం, నల్లమలసాగర్ డిపిఆర్కు ఎపి టెండర్లు పిలవగానే సుప్రీంలో పిటిషన్ వేశాం. పోలవరం విస్తరణ పనులను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరాం. గోదావరి జిలాల్లో 968 టిఎంసిల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. కేటాయించిన వరదజలాలపై 2 రాష్ట్రాలను సంప్రదించాల్సిందే’’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.