హైదరాబాద్: సంక్రాంతి పండగకి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా మరో 11 రైళ్లు నడపనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 7 నుంచి 12వ తేదీ మధ్య కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. ఆయా రైళ్లలో 1 ఎసి, 2 ఎసి, 3 ఎసి, స్లీపర్ కోచ్లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్లు కూడా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా రైళ్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయని పేర్కొంది.