మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డిఎ ఖరారు చేస్తూ విద్యుత్ శా ఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచీ ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (డిఎ)/డియర్ నెస్ రిలీఫ్ (డిఆర్) ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు. అం దులో భాగంగా ఈ సంవత్సరం 1-. 7-. 2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను 17.651 శాతంగా ఖరారు చేశారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోకి 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షన ర్లు లబ్ది పొందనున్నారు.
పెంచిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి లబ్ది చేకూరనుంది. జెన్ కో విషయానికి వస్తే 6,913 మంది ఉద్యోగులకు, 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లకు లబ్ది కలగనుంది. ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులకు, 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్లకు లబ్ది కలగనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులకు, 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ది కలగనుంది. మొత్తంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు కలిపి 71,387 మందికి లబ్ది చేకూరనుంది.