హైదరాబాద్: నగరంలోని మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించాడని బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్మాన్గూడ ఎస్ఎస్ఆర్ కాలనీలో అంబాదళ అశోక్, రూప నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు కూతురు విహారిక.. బిటెక్ మూడో సంవత్సరం చదువులోంది. స్థానికంగా ఉండే జై కిషోర్తో కొన్ని సంవత్సరాలుగా విహారిక ప్రేమలో ఉంది. అయితే వివాహం చేసుకొనేందుకు జై కిషోర్ నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విహారిక డిసెంబర్ 17న ఇంటి నుంచి వెళ్లిపోయంది. డిసెంబర్ 18న విహారికను ఆమె ప్రియుడు తీసుకువచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.
పెళ్లి చేసుకోవాలని విహారిక తల్లిదండ్రులు కూడా అతన్ని కోరారు. కానీ, అందుకు అతను నిరాకరించాడు. దీంతో విహారిక మనస్తాపానికి గురై.. ఇంట్లోని ఫ్యాన్కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కళ్ల ముందే కన్న కూతురు విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు ఘోరంగా విలపిస్తున్నారు.