మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం మహా జాతర 2026 పోస్టర్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.