అహ్మదాబాద్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి టి-20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా నెగ్గింది. మూడో మ్యాచ్లో మళ్లీ భారత్ గెలిచి సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దైంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఎలాగైనా ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని సౌతాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులు చేసింది. కుల్దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, గిల్ స్థానంలో సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకుంది. సౌతాఫ్రికా కూడా ఒక మార్పు చేసింది. నోర్ట్జే స్థానంలో లిండే జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ(కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
సౌతాఫ్రికా: క్వింటన్ డి కాక్(కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్మాన్.