మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్పై జయ్ వల్లందాస్ నిర్మించిన సినిమా మిస్టీరియస్. ఈ సస్పెన్స్, థ్రిల్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు బ్రహ్మానందం రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులో ఆసక్తి పెరిగింది. అలాంటి మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : కొండపూర్ ఎస్ఐ రాంఖీ (అబిద్ భూషణ్) మిస్ అవుతాడు. ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఏసిపి ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఆర్కిటెక్చర్ విరాట్ (రోహిత్ సాహ్ని) అతని భార్య శిల్ప (మేఘన రాజ్పుత్) ను విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్ కేసుకు విరాట్, – శిల్పలకు సంబంధం ఏంటి? విరాట్ కొన్న విల్లాకు రాంఖీ ఎందుకు వెళ్లాడు? ఈ కథలోకి మిస్సిరా (రియా కపూర్) ఎందుకు వచ్చింది? అసలు రాంఖీని ఎవరు చంపారు? అనే ట్విస్ట్లు, సస్పెన్స్తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
విశ్లేషణ : సినిమా చూస్తున్నంత సేపు మనం రెగ్యులర్ లైఫ్లో వచ్చే కొన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మనకు గుర్తొస్తాయి. అలాంటి కథకే కొన్ని ట్విస్ట్లు, ఆద్యంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి, కొన్ని జాగ్రత్తలు తీసుకుని డైరెక్టర్ కథ రాసుకున్నట్టు అర్థమైపోతుంది. ఈ సినిమాను చూసే ప్రేక్షకుడికి అసలు కిల్లర్ ఎవరూ అనే ప్రశ్న క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. అలా ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఇంటర్వెల్లో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. కథను నెక్స్లెవెల్కు తీసుకుళ్లే ప్రయత్నం చేశాడు.
అప్పటికే సినిమాలో వచ్చే ట్విస్ట్లు సస్పెన్స్, థ్రిల్లర్ను ఫీల్ అయ్యే ప్రేక్షకులకు సెకండాఫ్లో ఉండే హార్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఆసక్తిని కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్ సినిమాను మలుపుతిప్పుతుంది. అప్పటి వరకు కిల్లర్ వీరే అని అనుకునే ప్రేక్షకులు షాక్ అవుతారు. ఇక సినిమాలో మెయిన్ లీడ్లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్పుత్, అబిద్ భూషణ్ అద్భుతంగా నటించారు. సీనియర్ పోలీస్గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. ఇక ఎంఎల్ రాజా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సరైన మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తానికి – ‘మిస్టీరియస్’ మూవీ మిస్ చేయకుండా ఓ సారి చూడాల్సిన మూవీనే.