మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం లో బుధవారం (డిసెంబర్ 17) మూ డో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వర కు పోలింగ్ జరుగనుండగా, మధ్యా హ్నం 2తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. మూడో దశలో పోలింగ్ కోసం 36,483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 182 మండలాల లో 4,159 సర్పంచి స్థానాలకు, 36, 452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, అందులో 394 సర్పం చి స్థానాలు, 7,908 వార్డు స్థానాలు ఏ కగ్రీవం అయ్యాయి. 11 సర్పంచి స్థా నాలకు, 116 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 2 సర్పంచి స్థా నాలు, 18 వార్డు స్థానాల ఎన్నికలపై స్టే ఉంది. మిగిలిన 3,752 సర్పంచి స్థా నాలకు, 28,410 వార్డు స్థానాలకు ఎ న్నికలు జరుగనున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,652 మంది అభ్యర్థు లు పోటీ
పడుతుండగా, వార్డు స్థానాల కు 75,725 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడో విడతలో 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు,140 మంది ఇతరులు ఉన్నారు. ఓటర్లు ఎక్కడున్నా సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పల్లె ప్రగతికి బాధ్యతగా ఓటేయాలని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి సామర్థ్యాలున్న నాయకుడిని ఎంచుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో అందరూ ఇవిఎంలలో ఓటు వేస్తుండగా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేస్తే మీ ఓటు వారికి పడ్డట్లే. తెలిసీ తెలియక లేదా ఏమరుపాటుతో ముద్ర సరిగ్గా పడకపోయినా, ఇద్దరు అభ్యర్థుల మధ్య అటూ ఇటూ కాకుండా ముద్ర పడితే మీ ఓటు మాత్రం చెల్లుబాటు కాదు. ఖాళీ బ్యాలెట్ వేసినా ఆ ఓటు చెల్లదు. బ్యాలెట్లోని అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటా గుర్తుపై కూడా ఓటు వేయొచ్చు.