హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న అధికార పార్టీ రెండో విడతలోనూ అదే జోరును కొనసాగిస్తుంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటలకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే.. కాంగ్రెస్కు 1542, బిఆర్ఎస్కు 730. బిజెపి 182, ఇతరులకు 410 స్థానాలు దక్కాయి.