యంగ్ హీరో రోషన్ కనకాల రెండవ చిత్రం మోగ్లీ 2025 రిలీజ్కు రెడీ అవుతోంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా, డిసెంబర్ 13కి వాయిదా వేశారు. అయితే ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ప్రీమియర్ టాక్ సినిమాకు మరింత బెనిఫిట్ కానుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. రిలీజ్ డేట్ పోస్టర్లో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ ఛీర్ఫుల్గా కనిపించగా, బండి సరోజ్ కుమార్ ఇంటెన్స్ అవతార్లో కనిపించారు. లీడ్ పెయిర్ను మోడరన్ రాముడు- సీతల్లా చూపుతూ తమ ప్రేమకోసం పోరాటం చేసే జంటగా చిత్రీకరించారు. సరోజ్ది రావణుడిని పోలిన ప్రతినాయకుడి పాత్ర. కథ ఈ మూడు పాత్రల మధ్య డైనమిక్ చుట్టూ తిరుగుతుంది.