రెండేళ్ల ప్రస్థానంలో తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు అనునిత్యం ప్రయత్నించాం
నవ తరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరిపోశాం
రుణ భారంతో వెన్నువిరిగిన రైతుకు దన్నుగా నిలిచాం
ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతునిచ్చాం
గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్కు ప్రాణం పోశాం
లోతైన మధనంతో తెలంగాణ మార్గదర్శక పత్రం సిద్ధం
ప్రజలకు రెండేళ్ల పాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: జాతి కోసం, జనహితం కోసం, గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉం డాలి. గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంక ల్పం కావాలి. సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధై ర్యం ఇచ్చి మీ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ రెండేళ్ల ప్రస్థానంలో అనునిత్యం, అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించానని ‘ఎక్స్’ వేదికగా ఆయన తెలిపారు. గత పా లన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరాని కి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని పే ర్కొన్నారు. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు ద న్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని ఆ యన తెలిపారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి అదానీ, అంబానీల మాదిరిగా మహిళలను వ్యాపారరంగంలో నిలిపామన్నారు. బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామన్నారు.
రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు పలు పథకాలు
వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామని, చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. జయ జయహే తెలంగాణ అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చామని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500లకే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500ల బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదు
నేటి అవసరాలు తీర్చి, పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్ట లేదని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామన్నారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్కు మేం ప్రాణం పోశామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత దేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామని ఆయన అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని, నిన్నటి వరకు ఒక లెక్క అని, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అని, నిన్న, నేడు, రేపు మీ ఆశీర్వాదమే నా ఆయుధమని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వసం అని, మీ సహకారమే నాకు సమస్తమని, తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదని, అందరికి ప్రజా పాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.