హైదరాబాద్: చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవన నిర్మాణ సంస్థ వద్ద.. కార్మికులు వేసుకున్న గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. అక్కడ దాదాపు 50 గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణంగా తెలియ రాలేదు.