అమరావతి: దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలోని చీరాలలో పలు బీచ్లు మూసివేశారు. డిసెంబర్ 2 వరకు సముద్ర స్నానాలను అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. వాతావరణ శాఖ అధికారులు బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్ల వద్ద ఆంక్షలు విధించారు. చీరాల బీచ్లకు పర్యాటకులు రావొద్దని అధికారులు సూచనలు చేశారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. తీరం వెంబడి గంటకు 45- 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిత్వా తుఫాన్ బలహీన పడుతోంది. తీరాన్ని తాకే అవకాశం లేదని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు తుఫాన్ కదులుతుంది. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువళ్లూరు, రాణిపేట ప్రాంతాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి.