అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్, సదన్, వసంతిక మచ్చ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం అర్జునుడి గీతోపదేశం. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. సతీష్ గోగాడని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై త్రిలోక్ నాథ్ కాళిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 80 శాతం షూట్ హైదరాబాద్, రాజమండ్రి, అమలాపురం పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఆఖరి షెడ్యూల్ డిసెంబర్లో మొదలవుతుందని చిత్ర నిర్మాత త్రిలోక్ నాథ్ కాళిశెట్టి తెలిపారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.