మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అంతర్జాతీయ స్థాయిలో ఏర్పా ట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 8,9 తేదీల్లో జ రగనున్న ఈ సమ్మిట్కు ప్రపంచ వ్యా ప్తంగా ప్రతినిధులు హాజరవుతారని, వివిధ దేశాల అంబాసిడ ర్లు కూడా పాల్గొనే అవకాశం ఉందని అందువల్ల ఇక్కడికి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. రంగారె డ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీ లో జరుగుతున్న తెలంగాణ రైజిం గ్ గ్లోబల్ సమ్మి ట్ ఏర్పాట్లను ఆదివారం మధ్యాహ్నం సిఎం రేవం త్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమ్మిట్కు పాస్లు లేకుం డా ఎవరు ఎంట్రీ కా వడానికి వీలు లేదని, సమ్మిట్కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎం ట్రీ ఇవ్వకూడదని సిఎం ఆదేశించారు. శాఖల వా రీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని ఏర్పాట్లను తాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని సిఎం రేవంత్ చెప్పారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల ని పార్కింగ్కు ఇబ్బంది రావొద్దని ఆయన తెలిపారు. బందోబస్తుకు వచ్చే పోలీస్ సిబ్బందికి ఇ బ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, సమ్మిట్కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ విజయాల ఆవిష్కరణ
కాగా, రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సమ్మిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతు న్న సందర్భంగా రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, స్కీమ్ల వివరాలను ప్రదర్శించనున్నరు. రెండో రోజు తెంలగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్కు పారిశ్రామిక వేత్తలు, బడా కంపెనీల ప్రతినిధులు తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.