హైదరాబాద్: బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడం వల్ల కెటిఆర్ పై చట్టం ప్రకారం చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కక్ష సాధింపు ఉంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే అరెస్టు చేసేవాళ్లమని, చట్ట ప్రకారమే ఈ-కార్ రేసింగ్ కేసులో ముందుకెళ్తామని మహేష్ గౌడ్ తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష సాధించాలన్న ఆలోచన లేదని అన్నారు. కాళేశ్వరంపై సిబిఐ ఎందుకు విచారణ చేయడం లేదో బండి సంజయ్ చెప్పాలి? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.