రంగారెడ్డి జిల్లాలో సరూర్నగర్ మండలం కర్మన్ఘాట్ గ్రామంలోని సాయి గణేశ్ నగర్లో పార్కును హైడ్రా కాపాడింది. 1979లో మొత్తం 176 ప్లాట్లతో సాయి గణేష్ నగర్ లేఔట్ వేశారు. దాదాపు 450 చ.గ.ల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఈ పార్కు స్థలంపై అనధికార గది నిర్మాణం చేపట్టారు. వారిని ప్రశ్నించిన కాలనీ వాసులను ఆక్రమణదారులు బెదిరించారు. కాలనీ నివాసితులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా అధికారులు వెళ్లి పరిశీలించారు. పార్కు స్థలంపై చిన్న గది, గోడ వంటి అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తులు సమర్పించిన పత్రాలను పరిశీలించగా, ఆ నిర్మాణం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు కాని పూర్తిగా అక్రమ నిర్మాణం అని నిర్ధారించారు.హైడ్రా అధికారులు స్వయంగా ఆ అక్రమ గోడను తొలగించి, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.