నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు
ఇందిరమ్మ చీరల పంపిణీ రెండు దశల్లో చీరల పంపిణీ చేయాలని
అధికారులకు సిఎం రేవంత్ సూచన తొలిదశలో డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో పంపిణీ మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో
సమీక్షాసమావేశంలో అధికారులకు సిఎం రేవంత్రెడ్డి ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కోటి మం ది మహిళలకు కోటి చీరలను అందించాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇందిర మ్మ చీరలకు సంబంధించి మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా స మావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరను అందించాల ని అధికారులకు సూచించారు. నేడు ఇం దిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పం పిణీని ప్రారంభించనున్నారు. చీరలను పూ ర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారు. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చే యాలని నిర్ణయించారు.
ఇందిరా గాంధీ జయంతి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రెండవ దశలో పట్టణ ప్రాంతా ల్లో మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీ య మహిళా దినోత్సవం వరకు మహిళల కు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్ర హం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి పాల్గొనాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ హ్యాండ్లూమ్స్ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.