హైదరాబాద్: టోక్కో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్కి చెందిన ధనుష్ శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ స్వర్ణపతకం సాధించాడు. ఫైనల్స్లో 252.2 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన ధనుష్.. తద్వారా డెఫ్లంపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్ల సాధించిన షూటర్గా రికార్డు సృష్టించాడు. సూరత్కు చెందిన షూటర్ మహ్మద్ వానియా 250.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతాకం సొంతం చేసుకున్నాడు. తద్వారా రెండు పతకాలు భారత్నే వరించాయి.
ఈ నేపథ్యంలో ధనుష్ శ్రీకాంత్కు తెలంగాణ సర్కార్ భారీ సజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ.1.20 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీధర్ ప్రకటించారు. ఆదివారం (నవంబర్ 16) హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు.