హైదరాబాద్: ‘శివ’ హీరోగా అక్కినేని నాగార్జున కెరీర్ని, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు ఆర్జివి. ఈ సినిమాలో అమల హీరోయిన్గా నటి్ంచగా.. జెడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ తరం ప్రేక్షకుల కోసం ఈ సినిమాను 36 తర్వాత నవబంర్ 14న రీరిలీజ్ చేస్తున్నారు.
ఇక ‘శివ’ సినిమాలో ప్రతి సన్నివేశం ఐకానిక్గా ఉంటుంది. ముఖ్యంగా విలన్ గ్యాంగ్.. నాగార్జున మధ్య జరిగే అన్ని సన్నివేశాలు దేనికి అవే సాటి అన్నట్టు ఉంటాయి. అసలు విషయానికొస్తే.. శివలో నాగార్జున తన అన్న కూతురితో సైకిల్పై వెళ్తుంటే.. విలన్ గ్యాంగ్ ఛేజ్ చేసే సన్నివేశం సినిమా చూసిన అందరికి గుర్తుండే ఉంటుంది. సైకిల్పై పాపను కూర్చొబెట్టుకొని విలన్గ్యాంగ్ నుంచి తప్పుంచుకుంటూ వేగంగా సైకిల్ తొక్కుతుంటారు నాగార్జున. ఈ సీన్లో యాక్ట్ చేసిన పాప ఇప్పుడు ఎలా ఉందో ఆర్జివి ట్వీట్ చేశారు.
ఆ అమ్మాయి పేరు సుష్మ అని.. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఎఐ, కాగ్నిటివ్ సైన్స్లో రీసెర్చ్ చేస్తుందని ఆర్జివి పేర్కొన్నారు. అంతేకాదు.. ఆమెకు సారీ కూడా చెప్పారు. అప్పుడు ఈ సీన్ని చిత్రీకరించినప్పుడు ఆ పాప ఎంత భయపడి ఉంటుందో తనకు అప్పుడు అర్థం కాలేదని.. ఒక దర్శకుడిగా తన స్వార్థంతో రిస్కీ సీన్ని చిత్రీకరించానని ఆయన అన్నారు. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమెకు ఆర్జివి సారీ చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
Hey @symbolicsushi please accept my sincere apologies after 36 years for subjecting you to such a traumatic experience which I dint realise at that time ..The directorial greed in me took over in being blinded to subjecting a little girl like you to such risky shots ..I apologise… https://t.co/NWzrRzl9Ib
— Ram Gopal Varma (@RGVzoomin) November 12, 2025