మన తెలంగాణ/సిటీ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు వేదికగా కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంను సిద్దంచేశారు. పోలింగ్ లో సుమారు 48.49 శాతం ఓట్లు పోలయ్యా యి. డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్గా యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ని ర్వహించేందుకు జిల్లా ఎన్నికల విభాగం ఏ ర్పాట్లు చేస్తుంది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ఎలక్ష న్ స్టాఫ్ కు శిక్షణలు కూడా నిర్వహించారు. ఈపాటికే భద్రతను పటిష్టంచేసిన ఎన్నికల అ ధికారి కర్ణన్.. ఫలితాన్ని కూడా ఏలాంటి సం దేహాలకు తావులేకుండా వెల్లడించాలని ఏ ర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.ఈ పోలింగ్లో మొత్తం పోలైన లక్షా 94 వేల 632 ఓట్లను 10 రౌండ్లుగా 42టేబుళ్ల మీద లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్పై ముగ్గురు సిబ్బందిని నియమించారు. వీరిలో ఒకరు సూపర్ వైజర్, మరొకరు అసిస్టెంట్ సూపర్ వైజర్తో పాటు మరోకరు స హాయక సిబ్బందిని నియమించారు. పోలింగ్ స్టేషన్ల నెంబర్ 1 నుంచి 407 వరకు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలను అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షం లో తెరువనున్నారు. ఎన్నికల అధికారులు అంచనాలను తారు మారు చేస్తూ ఆవించిన ఓటింగ్ శాతానికి తక్కువగా పోలింగ్ శాతం నమోదు కావటంతో
శుక్రవారం మధ్యాహ్నాం మూడింటి కల్లా తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. పోలింగ్ స్టే షన్ల ఆవరణలో అమలు చేసిన వంద మీటర్ల ఆంక్షను శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా కూడా అమల్లో ఉంటుందని ఎలక్షన్ వింగ్ అ ధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ సెంటర్ లో పటిష్టమైన భద్రతతో పాటు సీసీ టీవీ కెమెరాలు, సాయుధ బలగాలతో మధ్య కోట్ల విజ య భాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలోనీ స్ట్రాం గ్ రూమ్ నుంచి ఈవీఎంలను పైగా తీసుకువ చ్చి లెక్కించేందుకు కావల్సిన స్థాయిలో కౌం టింగ్ స్టాఫ్ ను నియమించినట్లు తెలిసింది.
ఈ నెల 14న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఔట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా, నోటా తో కలిపి మొత్తం 59 మందికి పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ కు సంబంధించి 58 అభ్యర్ధులు, నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను వెల్లడించనున్నారు. కానీ ప్రధాన పోటీ అధికార, విపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉండే అవకాశమున్నట్లు పోలింగ్ సరళిని బట్టి అంచనా వేయవచ్చు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల వెబ్సైట్లోనూ నమోదు చేసేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.