ముంబయి: బాలీవుడ్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు బ్రీంచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అర్థరాత్రి గోవిందా (61) స్పృహ కోల్పోవడంతో జుహులో బ్రీంచ్ కాండీ ఆస్పత్రికి తరలించామని మేనేజర్ లలిత్ బిందాల్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.