హైదరాబాద్: హెచ్ సిఎలో గ్రామీణ స్థాయి క్రికెటర్ల అవకాశం కల్పించట్లేదని తల్లిదండ్రులు తనను కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.ఈ విషయంపై స్పందిస్తూ.. బిసిసిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. హెచ్ సిఎలో జరుగుతున్న జూనియర్, సీనియర్ సెలెక్షన్లపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీలో రూ. లక్షలు తీసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారని, గతంలో బాగా ఆడేవారిని కూడా ఎంపిక చేయలేదని తల్లిదండ్రులు ఆరోపించారని మండిపడ్దారు. త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయని బండిసంజయ్ హెచ్చరించారు.