హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హోమ్ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్ల కేటాయించామని.. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.60,799 కోట్లతో రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని కోమటిరెడ్డి కొనియాడారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు, రూ.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ రహదారి విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. రూ.36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్కకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.