హైదరాబాద్: మోతె మండలం లో విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. పెద్దరాజు తండాకు చెందిన విద్యార్ది భానోతు రవీందర్ నాయక్ (21), బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. జెఎన్ టియు హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి రవీందర్ ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ మృతుడి బంధువుల ఆందోళన చేశారు. కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగానికి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.