రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైకమిషనర్ ఆఫ్ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్ కూటర్ బృందం శనివారం భేటీ అయ్యింది. ఐటీ, ఫార్మా, ఎయిరోస్పేస్, డిఫెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై సిఎం వారితో చర్చించారు. దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల గురించి కెనడా హైకమిషనర్కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్ను సిఎం రేవంత్ కోరారు. పెట్టుబడుల్లో భాగంగా స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్స్లోనూ పెట్టుబడులు పెట్టాలని సిఎం సూచించారు. ఈ సమావేశంలో శ్రీమతి కారెన్, కెనడా మినిస్టర్ ఎడ్ జాగర్, ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్, స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.