మన తెలంగాణ/హైదరాబాద్ : తీన్ నెంబర్ కా రు.. మిగితావి బేకార్ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పై నుంచి మూడో నెంబర్లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తారని ఓటర్లకు ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని వి మర్శించారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. భర్త చనిపోయిన మాగంటి సునీతమ్మ ఏడిస్తే ఆరోపణలు చేస్తారా..? అని మండిపడ్డారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో
భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా రహమత్నగర్లో శనివారం కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆ ర్ మాట్లాడుతూ..ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని మండిపడ్డారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు రేవంత్ సర్కార్ ఆ గమయ్యే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నామని…కానీ, ఒక్కసారైనా మాకు ఓటేయకపోతే పథకాలు బంద్ చేస్తామని బెదిరించామా..? అని అడిగారు. కానీ రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చే శారు.ఇది చైతన్యవంతమైన తెలంగాణ అని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను గతంలో చాలామందిని చూశామని అన్నారు.
రెహమత్ నగర్ నుంచి 12 వేల మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది
2023లో మాగంటి గోపీనాథ్కు అత్యధిక మెజార్టీ ఇచ్చింది రెహమత్ నగరే అని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో గోపినాథ్కు ఈ డివిజన్ నుంచే 6 వేల మెజార్టీ వచ్చిందని, ఈసారి రెహమత్ నగర్ నుంచి 12 వేల మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. గోపన్న నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీటి సమస్యను తరిమికొట్టామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందించిన నేత గోపీనాథ్ అని పేర్కొన్నారు.గోపీనాథ్ అకాల మరణం తీరని లోటు అని చెప్పారు. రెండేండ్లలో రేవంత్ రెడ్డి ఒక్క మంచి పని చేశారా..? అని ప్రశ్నించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని అన్నారు.
అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేశారని మండిపడ్డారు. అసలేం పథకం ప్రారంభించావు అని సిఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. కెసిఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ రెడ్డి రద్దు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా..? అని అడిగారు. స్పెషల్ ఉర్దూ డిఎస్సి నిర్వహిస్తామన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. కేవలం ఐదేళ్ల కోసమే రేవంత్ రెడ్డిని గెలిపించారని, సరిగ్గా పాలించకపోతే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని అన్నారు. 500 రోజుల్లో బిఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని, కెసిఆర్ తిరిగి సిఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టిఆర్ హిల్స్లో బ్రహ్మాండమైన స్టేడియం కట్టి మాగంటి గోపీనాథ్ పేరు పెడతామని కెటిఆర్ తెలిపారు.