మహిళల ప్రపంచకప్ 2025 భాగంగా సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ లిచ్ఫీల్డ్(119) మెరుపుతో శతకంతో చెలరేగింది. మరో ఓపెనర్ అలీసా హీలీ (5) త్వరగా ఔటైనా.. వన్ డౌన్ లో వచ్చిన ఎలీస్ పెర్రీతో కలిసి లిచ్ఫీల్డ్ భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కేవలం 133 బంతుల్లో155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత అమన్జోత్ కౌర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బెత్ మూనీ వేగంగా ఆడుతూ.. వ్యక్తిగత స్కోరు 24 వద్ద శ్రీచరణి బౌలింగ్లో ఔటైంది. దీంతో ఆస్ట్రేలియా జోరుకు కొంత బ్రేక్ పడింది. మరోవైపు పెర్రీ ఆచితూచి ఆడుతూ అర్ధశతకాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 38 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. క్రీజులో ఎలీస్ పెర్రీ(69), ఆష్లీన్ గార్డ్నర్ (3)లు ఉన్నారు. భారత బౌలర్లలో శ్రీచరణీ రెండు వికెట్లు తీయగా.. అమన్జోత్, క్రాంతి గౌడ్ లు చెరో వికెట్ పడగొట్టారు.