హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నబండిప్రకాశ్ తో కలిసి డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో పుల్లూరి ప్రసాద్ రావు కిషన్ జీకి అనుచరుడిగా మారారని, 1981 లో పుల్లూరి ప్రసాద్ రావు పీపుల్స్ వార్ లో చేరారని తెలియజేశారు.1983 లో పుల్లూరి ప్రసాద్ కమాండర్ అయ్యారని, 1992 లో ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీగా పని చేశారని డిజిపి శివధర్ రెడ్డి పేర్కొన్నారు.