సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 24 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 141 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసి భారత జట్టు ముందు 237 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఇంకా 96 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 24 పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్లో అలెక్స్ కారేకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(62), విరాట్ కోహ్లీ(38) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.