అమరావతి: తిరుపతి నగర కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశంలోకి బయట వ్యక్తి లోపలి కొచ్చి వైసిపి సభ్యుడిపై దాడి చేశాడు. కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ ఎస్.కె. బాబు, గణేష్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇదే సమయంలో బయటకు కౌన్సిల్ లోకి దూసుకొచ్చి వైసిపి కార్పొరేటర్ గణేశ్ పై దాడికి పాల్పడ్డాడు. వెంటనే కింద కూర్చొని కార్పొరేటర్ గణేష్ నిరసన తెలిపాడు. దీంతో కౌన్సిల్ సాక్షిగా కార్పొరేటర్ ఎస్.కె.బాబు క్షమాపణ చెప్పాడు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో 3వ డివిజన్ వైసిపి కార్పొరేటర్ గణేష్ కుమార్ పై దాడి ఘటనలో ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేస నమోదైంది. మున్సిపల్ కమిషనర్ మౌర్య ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.