ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విక్రయం
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడ, తొర్రూర్, మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి ప్రాంతాల్లోని రాజీవ్ స్వ గృహ కార్పొరేషన్కు సంబంధించి మొత్తం 167 ఓపెన్ ప్లాట్లకు ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ -వేలం నిర్వహించనున్నారు. తొర్రూర్లో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలోని 120 ప్లాట్లకు, కుర్మల్గూడలో 200 నుంచి -300 చదరపు గజాల విస్తీర్ణంలోని 29 ప్లాట్లు, బహదూర్పల్లిలోని 200 నుంచి 1,000 చదరపు గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్లను ఈ -వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లకు గతంలో బహిరంగ వేలం నిర్వహించగా ప్రస్తుతం ఈ–వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. కుర్మల్ గూడ, బహదూర్ పల్లిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు ఆఖరు తేదీ అక్టోబరు 27వ తేదీ కాగా, అక్టోబరు 28వ తేదీ ఉదయం, మధ్యాహ్నాం సమయాల్లో ఈ-వేలం నిర్వహించనున్నారు.